ఆంధ్రప్రదేశ్‌

పెద్దనోట్ల రద్దుపై పాలకుల్ని ప్రశ్నిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 13: కేంద్ర ప్రభుత్వం మూర్ఖత్వంగా అమలు చేసిన పెద్దనోట్ల రద్దుతో గత 36రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పాలకులను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతోందని ఎపిపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. ఈ నెల 23న రాజధాని అమరావతిలోని వెగలపూడి సెక్రటేరియేట్ వద్ద నోట్లపాట్ల బాధితులు, ఇతర ప్రజానీకంతో కలిసి ‘చలో వెలగపూడి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధికార బిజెపి, డిటిపి మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొంటారన్నారు. బ్రెయిన్ లెస్ పాలకులు చేపట్టిన క్యాష్‌లెస్ సొసైటీ నిర్మాణ వ్యవహారంలో బిజెపి, టిడిపి కుమ్మక్కైనట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల లావాదేవీలకు సర్వీస్ చార్జ్ రూపంలో వసూలవుతున్న సుమారు లక్షా 50వేల కోట్ల రూపాయల జమా ఖర్చుల వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సమాధానం చెప్పలేక ప్రధాని నరేంద్ర మోదీ తప్పించుకుంటున్నారని విమర్శించారు. పార్లమెంట్ మెట్లను ముద్దాడినంత మాత్రాన గౌరవం పెరగదని, చట్టసభలో సభ్యుల ప్రశ్నలకు వివరణ ఇస్తే గౌరవంతో పాటు ప్రతిష్ఠ కూడా పెరుగుతుందనే విషయాన్ని మోదీ గుర్తించాలన్నారు. నోటుపాట్లపై కాంగ్రెస్ రూపొందించిన నివేదికను ఉభయ సభల కాంగ్రెస్ నేతలకు అందించామన్నారు.