ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా కలశజ్యోతుల ఊరేగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : అమ్మవారి భవానీ దీక్షల విరమణ సూచకంగా మంగళవారం సాయంత్రం నగరంలోని సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం నుండి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ ఇవో ఎ సూర్యకుమారి ఈ ఊరేగింపును ప్రారంభించారు. ప్రధాన సెంటర్ల ద్వారా సాగిన కలశజ్యోతుల ఊరేగింపు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను వెండి రథంపై ఉంచి ముందుభాగంలో వందలాది మంది భవానీలు కలశజ్యోతులు పట్టుకొని ‘జై దుర్గ్భావానీ జై’ అంటూ పెద్దపెట్టున భక్తినినాదాలు చేశారు. మేళతాళాలు, భూతభేతాళ నృత్యాలు, మహిళా భక్తుల కోలాటం, ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను అలరించాయి.