ఆంధ్రప్రదేశ్‌

రాజధాని.. 27 పట్టణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 17: ఆధునిక రాజధాని అమరావతి మహానగరంలో 27 పట్టణాలు ఉండే విధంగా సీఆర్డీఏ ప్రాజెక్ట్ నివేదిక సిద్ధమయింది. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో 53,478 ఎకరాల్లో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో గ్రీన్ - బ్లూ (పచ్చదనం - జలకళ) ప్రాంతానికి 29.5 శాతం భూమిని కేటాయించారు. కృష్ణా నది ఒడ్డున 15 కిలోమీటర్ల ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరగనుంది. రాజధానిలో వివిధ అంశాలకు ప్రాధాన్యత పరిపాలన, ఆర్థిక, న్యాయ, వైద్య, పర్యాటక, మీడియా, ఎలక్ట్రానిక్, విజ్ఞాన, క్రీడల నగరాలు నిర్మించనున్నారు. వాటిని మళ్లీ 27 నగరాలుగా విభజిస్తారు. ఒక్కో పట్టణం వెయ్యి ఎకరాల్లో రెండు చదరపు కిలోమీటర్ల విస్తరించగా, అందులో దాదాపు 28వేల ఇళ్ళు, లక్ష మంది జనాభా ఉంటారు. ఒక్కో పట్టణంలో నాలుగు రహదారులు నిర్మించనున్నారు. వాటిని పట్టణ సరిహద్దుల్లో నిర్మించే ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసి ప్రతి పట్టణంలో ఒక జూనియర్ కాలేజీ, ఒక మెట్రో స్టేషన్ నిర్మించాలని ప్రాజెక్ట్ నివేదిక రూపొందించారు. ఒక్కో పట్టణాన్ని నాలుగు సమాన ప్రాంతాలు నైబర్ హుడ్, ఇరుగుపొరుగుగా విభజించనున్నారు. 250 ఎకరాల్లో కిలోమీటర్ లోపల ఉండే ఒక్కో ప్రాంతంలో దాదాపు 7వేల గృహాలు, 25వేల జనాభా ఉండేలా చూపనున్నారు. ఈ ప్రాంతంలో ఉండే అందరికి నడచి వెళ్ళేంత దూరంలో ప్రాథమిక పాఠశాల, షాపింగ్ మాల్ వంటివి అందుబాటులో ఉంటాయి. రాజధానిలో ఇటువంటి ప్రాంతాలు వంద వరకు ఉండబోతున్నాయి. ఒక్కో ఇరుగుపొరుగు ప్రాంతాన్ని మళ్లీ నాలుగు సమానమైన చిన్న చిన్న ప్రాంతాలు (కమ్యూనిటీలు)గా విభజించి, 62.5 ఎకరాల్లో అర కిలోమీటరు పరిధిలో ఉండే ఈ కమ్యూనిటీలో దాదాపు 1700 ఇళ్ళు, ఆరు వేల జనాభా ఉండేలా చూడనున్నారు. ఒక్కో కమ్యూనిటీని మళ్లీ రెండు నుంచి నాలుగు క్లస్టర్ (పరిమిత ప్రదేశం)లుగా విభజిస్తారు. ఒక్కో క్లస్టర్‌లో ఒక్కో పార్కు ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉండేవారందరికీ కలిపి వాహనాలకు ఉమ్మడి పార్కింగ్ ప్రదేశం, ఒక్కో క్లస్టర్ 15 నుంచి 30 ఎకరాల ప్రదేశం ఉంటుంది. ఇందులో మూడు వందల నుంచి 8 వందల కుటుంబాల వరకు ఉంటాయి. జనాభా 1500 నుంచి మూడు వేల వరకు ఉంటారు. ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్న నగరమైనందున కావాల్సిన విధంగా పట్టణాలు, ప్రాంతాలు, క్లస్టర్లు, రోడ్లు, వాణిజ్య కేంద్రాలు, కాలేజీలు, మెట్రో స్టేషన్లు, పార్కులు, పార్కింగ్ ప్రదేశాలు విభజించుకోవడానికి నిర్మించుకోవడానికి వీలవుతుందని సీఆర్‌డిఏ తన నివేదికలో పేర్కొంది. కృష్ణానది ఒడ్డున ఒక క్రమ పద్ధతిలో కమర్షియల్ బిల్డింగ్‌లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతాన్ని ప్రధాన వాణిజ్య కేంద్రం (సిబిడి - సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్)గా తీర్చిదిద్దుతారు. ఇక్కడ ముఖ్యమైన ఆర్థిక సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలను ఏర్పాట్లు చేయనున్నారు. వాణిజ్యపరంగా మూడు ప్రాంతీయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. స్థానిక వాణిజ్య అవసరాలకు ప్రతి కమ్యూనిటీలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో సకల హంగులతో విశాలమైన రోడ్లు నిర్మించనున్నారు. 60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు, 50 మీటర్ల వెడల్పుతో 275 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 25 మీటర్ల వెడల్పుతో మరికొన్ని రోడ్లు, 97.5 కిలో మీటర్ల పొడవున ఆరు వరుసల ఇన్నర్ రింగ్ రోడ్డు, 186 కిలోమీటర్ల పొడవున 8 వరుసల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నారు. 134 కిలో మీటర్ల పొడవున మెట్రో రైలు మార్గం నిర్మించే ప్రతిపాదన కూడా అందలో ఉంది. కాలుష్యరహిత రాజధాని నిర్మించాలన్నది సిఎం చంద్రబాబు లక్ష్యం. జలకళత పచ్చని చెట్లు, పచ్చికబయళ్లతో నిండిన పర్యావరణాన్ని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం 3 నగర స్థాయి పార్కులు, 27 పట్టణ స్థాయి పార్కులు, వందకుపైగా చిన్న పార్కులు ఏర్పాటు చేస్తాం, అత్యంత ఆధునికంగా ప్రపంచ స్థాయిలో మహాద్భుత నగర నిర్మాణ పనుల్లో సీఆర్డీఏ నిమగ్నమై ఉందని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ చెప్పారు.