ఆంధ్రప్రదేశ్‌

స్వయంసహాయక బృందాలకు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వయంసహాయక బృందాలకు కేంద్ర అవార్డులును అందజేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుస్సేనాపురంలోని మీరా, తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం భైరవపాలెంలోని శ్రీనివాస, అనంతవురం జిల్లా బికె సముద్రం మండలం సిద్దరాంపురంలోని మాధవరాజులు అవార్డులు అందుకొన్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ అవార్డులును అందజేశారు. అవార్డుకింద లక్ష రూపాయల చొప్పన నగదు పురస్కారం అందజేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన శాంతి గ్రామాభివృద్ధి సంస్థ ఉత్తమ గ్రామ సంస్థగా పురస్కారం అందుకుంది.
ఇక తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని నాయుడుపేటకు చెందిన సుజాత సుప్రియ స్వయంసహాయక బృందానికి, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తికి చెందిన స్వామి శరణం అయ్యప్ప స్వయం సహాయక బృందానికి ఈ అవార్డు కింద రూ.1 లక్ష చొప్పన నగదు పురస్కారం అందజేశారు. అలాగే సిరిసిల్ల జిల్లాలోని చిన్నబోనాలు గ్రామానికి చెందిన సరస్వతి గ్రామాభివృద్ధి సంస్థ ఉత్తమ గ్రామాభివృద్ది సంస్థగా అవార్డు అందుకొంది.