ఆంధ్రప్రదేశ్‌

రైలులో టిటిఇ రాసలీలలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, డిసెంబర్ 23: కదులుతున్న రైలులో ఓ టిటిఇ పబ్లిక్‌గా రాసలీలలు సాగించాడు. తాగిన మత్తులో ఓ మహిళతో బెర్త్‌పై రాసలీలలు సాగిస్తుండగా గమనించిన ప్రయాణికులు నిలదీయడంతో రైలు నుంచి దిగిపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. టిటిఇ రాసలీలలను వీడియో, ఫొటోల్లో బంధించిన కొంతమంది ప్రయాణికులు వాటిని రైల్వే బోర్డుకు పంపి ఫిర్యాదు చేశారు. కన్యాకుమారి-ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వే టిటిఇ సత్యబాబు మద్యం తాగి గురువారం రాత్రి రేణిగుంటలో కన్యాకుమారి-ముంబాయి ఎక్స్‌ప్రెస్‌లో విధులకు హాజరయ్యాడు. వెంట ఓ మహిళ కూడా ఉంది. ఎసి బి-2 కోచ్‌లోని బెర్తు వద్ద ఇద్దరు పడుకున్నారు. తెల్లవారుజామున ప్రయాణికులు అంతా నిద్రమత్తులో ఉండగా టిటిఇ సత్యబాబు ఆ మహిళతో రాసలీలలు సాగించాడు. ఇంతలో మెళకువ రావడంతో కొంతమంది ప్రయాణికులు అటుగా వెళ్లగా టిటిఇ రాసలీలలు కనిపించడంతో అవాక్కయ్యారు. తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లో కొంతమంది వీడియో తీయగా, మరికొంతమంది ఫొటోలు తీశారు. పబ్లిక్‌గా ఇలా చేయవచ్చా అని ప్రయాణికులు నిలదీయగా వారితో టిటిఇ వాగ్వివాదానికి దిగాడు. అప్పటికే రైలు కడపకు చేరుకోవడం ఆ మహిళ దిగిపోయింది. రైలు గుత్తికి చేరుకోగానే లగేజీ వదిలేని టిటిఇ రైలు దిగి పరారయ్యాడు. ప్రయాణికులు తమ వద్ద ఉన్న వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను రైల్వేబోర్డు, రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభుకు వాట్సాప్, మెయిల్‌లో పంపి ఫిర్యాదు చేశారు. రైలు గుంతకల్లుకు చేరుకోగానే ప్రయాణికులు అక్కడి రైల్వే జిఆర్‌పి, ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్పీఎఫ్ ఎస్సై భాస్కర్, జిఆర్‌పి పోలీసులు రైలులో జరిగిన సంఘటనపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు.