ఆంధ్రప్రదేశ్‌

2 రోజుల్లో తీపి కబురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 27: మరో రెండు రోజుల్లో దేశ ప్రజలంతా తీపి కబురు వినబోతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో నగదు రహిత లావాదేవీలపై విద్యార్థులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తీపి కబురు వింటారని చెప్పినా, ఆ తీపి కబురు దేని గురించో చెప్పలేదు. అవినీతిపరులకు ఇక వేధింపులు అధికమవుతాయన్నారు. బ్యాంకులకు వచ్చేదంతా తెల్లడబ్బు కాదన్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ దేశంలో నల్లధనంపై యుద్ధం ముగిసిందని, ఇక డిజిటల్ యుద్ధంలో సైనికులం కావల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.