ఆంధ్రప్రదేశ్‌

వౌలిక వసతుల ప్రణాళిక పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 27: నూతన రాజధాని అమరావతి నగరానికి కావలసిన వౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రణాళిక పూర్తయింది. అత్యున్నత స్థాయిలో వౌలిక వసతులతోపాటు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉన్నత జీవనం, పర్యావరణ అనుకూల అభివృద్ధి అమరావతికి మూలస్తంభాలుగా ప్రభుత్వం భావిస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని సీఆర్డీఏ ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది. ఉన్నతస్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న రాజధానికి అవసరమైన ప్రధాన రోడ్లు, నీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరా, కేబుల్ వ్యవస్థ వంటి వౌళిక అవసరాలను తీర్చడానికి కావలసిన చర్యలను ప్రభుత్వం మొదలు పెట్టింది. ఆధునిక రాజధానికి 742 ఎంఎల్‌డి (మిలియన్ ఆఫ్ లీటర్స్ పర్ డే) నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. ఇంత నీటి సరఫరాకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునికమైన రీతిలో మురుగునీటి పారుదల వ్యవస్థను రూపొందించారు. 592 ఎంఎల్‌డిల మురుగునీరు ప్రవహించే అవకాశం ఉందని లెక్క తేల్చారు. ఇందు కోసం 316 (నాళాలు, అనుబంధ నాళాలు) కిలోమీటర్లు + 277 (సంగ్రాహకాలు) కిలోమీటర్ల మేర మురుగు కాలువల నిర్మాణం చేస్తారు. అలాగే 3355 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 2710 మెగా వాట్ల విద్యుత్ సరఫరాకు కావలసిన చర్యలు చేపట్టారు. ఇన్‌ఫ్రాస్టక్చర్, పిఎంసి (ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్), బ్రూ అండ్ గ్రీన్ (జలకళ - పచ్చదనం) అందరు కన్సల్టెంట్లతో సీఆర్డీఏ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. వౌళిక వసతుల అభివద్ధి, గృహ నిర్మాణం, వాణిజ్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణ, విద్య ప్రాజెక్టులు, పర్యాటకం, దాని అనుబంధ ప్రాజెక్టులు, పరిశ్రమలు, సేవల రంగం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. కాగా అమరావతి మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. 90 శాతం పైగా భూమిని సీఆర్డీఏ స్వాధీనం చేసుకుంది. రాజధాని పరిధిలో 53,478 ఎకరాల భూమి ఉంది. ఇందులో 37,505 ఎకరాలను లాండ్ పూలింగ్ పథకం కింద సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 34,984 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. 217 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత ఆధునిక ప్రభుత్వ భవనాల మాస్టర్ ఆర్కిటెక్ట్‌లుగా లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్, మన దేశానికి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్‌లను ఎంపిక చేశారు. మిగిలిన ప్రభుత్వ భవనాల ఆర్కిటెక్ట్‌ల ఎంపికకు కూడా టెండర్లను పిలిచారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా అత్యంత సౌకర్యంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపకల్పన చేశారు. దానికి అనుగుణంగానే ప్రధానమైన రోడ్లన్నిటికి టెండర్లు పిలిచారు. భూగర్భంలో ఈహెచ్‌టీ (ఎలక్ట్రానిక్ హై టెక్షన్) కేబుల్ లైన్స్ అమర్చడానికి టెండర్లను త్వరలో పిలుస్తారు. దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను ఏపికి తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. ఆ మేరకు ఇప్పటికే దేశ విదేశాల్లోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం, భూములు కేటాయించడం జరిగిపోయాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్), శ్రీరామస్వామి మెమోరియల్ (ఎస్‌ఆర్‌ఎం) యూనివర్శిటీ, అమృత యూనివర్శిటీ, ఇండో-యుకే హెల్త్ ఇన్‌స్టిట్యూట్, డాక్టర్ బిఆర్ శెట్టి మెడికల్ సిటీ వంటి వాటితోపాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారు. ఇండో-యుకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు మొదటి దశలో 50, రెండవ దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడి)కి 50 ఎకరాలు, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సిఐటిడి)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సిఆర్‌డిఏ నిర్ణయం తీసుకుంది. రాజధానిలో పాఠశాలలు, స్టార్ హోటళ్లు, హాస్పటళ్ళు, ఎంఐసిఈ (మీటింగ్స్, ఇనె్సంటివ్స్, కాన్ఫరెనె్సస్, ఈవెంట్స్) సెక్టార్‌లో నిర్మాణానికి సిఆర్డీఏ ఆర్‌ఎఫ్‌పిలను ఆహ్వానించింది. 160కి పైగా ప్రాథమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కళాశాలలు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన. అందులో భాగంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సిఆర్‌డిఏ ఆర్‌ఎప్‌పిలను ఆహ్వానించింది. అలాగే ఒక 5 స్టార్, ఒక 4 స్టార్, 4 త్రీస్టార్ హోటళ్లకు ఆర్‌ఎఫ్‌పిలను విడుదల చేసింది. మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ శక్తి వంటి వాటికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు సిఇర్‌డిఏ వర్గాలు తెలిపాయి.