ఆంధ్రప్రదేశ్‌

ఎన్నారై ఆస్పత్రిలో అవయవదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 27: గుంటూరు జిల్లా మంగళగిరి మం డల పరిధిలోని చినకాకానిలోని ఎన్నారై ఆస్పత్రిలో నరాల వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన మాచవరం మండలం గణేషునిపాడు గ్రామానికి చెందిన మల్లెల భూలక్ష్మి బ్రెయిన్‌డెడ్ కావడంతో ఆమె కుమారుడు, కుమార్తెలు కలిసి భూలక్ష్మి అవయవాలను మంగళవారం దానం చేశారు. భూలక్ష్మి లివర్‌ను విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి, నేత్రాలను గుంటూరులోని డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్‌కు, కిడ్నీలలో ఒకదాన్ని చినకాకాని ఎన్నారై జనరల్ ఆస్పత్రికి, రెండో కిడ్నీని విజయవాడలోని విజయ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి దానం చేశారు.