ఆంధ్రప్రదేశ్‌

నేడు కలెక్టర్ బాబు.ఎకు ప్రధాని మోదీ సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 29: నగదు రహిత డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తూ దేశంలోనే కృష్ణా జిల్లాను మొదటి స్థానంలో నిలిపి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపిన జిల్లా కలెక్టర్ బాబు.ఎను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సన్మానించనున్నారు. ఢిల్లీలోని టలకటోర స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. కృష్ణా జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే, ఆధార్‌తో అధారిత నగదు రహిత చెల్లింపులు, ప్రజాపంపిణీ, పింఛన్లు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ వేతనాలు, రైతులకు ఎరువుల పంపిణీ, దుకాణాల్లో పాస్ యంత్రాలు కూడా నగదు రహిత చెల్లింపులు చేయటంలో ప్రధాన పాత్ర వహించి న కలెక్టర్ బాబు.ఎ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. నగదు రహిత చెల్లింపుల్లో డిజిటల్ ఎకానమి దిశగా జిల్లాను నూతన సాంకేతిక దిశగా సరికొత్త ఒరవడి సృష్టిస్తున్న జిల్లా కలెక్టర్ బాబు.ఎ కృషికి నిదర్శనంగా అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది.