ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా కలెక్టర్‌కు ప్రధాని ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 30: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటంలో కృషి చేస్తున్నందుకు కృష్ణాజిల్లా కలెక్టర్ బాబును ప్రధాని మోదీ ప్రశంసించారు. ఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన డిజిధన్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ బాబుకు ప్రశంసాపత్రం అందజేసి సత్కరించారు. దేశంలోనే నగదు రహిత లావాదేవీలు మారుమూల గ్రామాల్లో సైతం అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా మొదటిస్థానంలో నిలిపినందుకు ఈ అభినందన లభించింది.ఝకృష్ణాజిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే, ఆధార్‌తో ఆధారిత నగదు రహిత చెల్లింపులు, ప్రజాపంపిణీ, పింఛన్లు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ వేతనాలు, రైతులకు ఎరువుల పంపిణీ, దుకాణాల్లో పాస్ యంత్రాల ద్వారా నగదు రహిత చెల్లింపులు చేయటంలో ప్రధానపాత్ర వహించి కృష్ణాజిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. నగదు రహిత చెల్లింపుల్లో డిజిటల్ ఎకానమి దిశగా జిల్లాను నూతన సాంకేతిక దిశగా సరికొత్త ఒరవడి సృష్టిస్తున్న జిల్లా కలెక్టర్ బాబు.ఎ కృషికి నిదర్శనంగా ఈ అవార్డు లభించింది.

చిత్రం..ఢిల్లీలో ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు