ఆంధ్రప్రదేశ్
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 31 December 2016
విజయవాడ, డిసెంబర్ 30: వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం శనివారం సమావేశం కానుంది. జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమం ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. కొత్తగా మంజూరు చేయనున్న రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు, పింఛన్ల పంపిణీకి నగదు సిద్ధం చేయడం వంటి అంశాలు చర్చకురానున్నాయి. రిజర్వు బ్యాంక్ నిబంధనల కారణంగా గతంలో పింఛన్లు పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయనున్నారు.