ఆంధ్రప్రదేశ్‌

న్యాయవాది దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 4 : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సోమవారం పట్టపగలే ఘాతుకం చోటు చేసుకుంది. పగలు 12 గంటల సమయంలో న్యాయవాది పలివెల దత్తాత్రేయ రామానంద రాయలు (45) దారుణంగా హత్యకు గురయ్యారు. వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన రాయలు సోమవారం ఉదయం 12 గంటల సమయంలో రాయలు గాంధీ స్కూలు సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఓ షాపులో కూర్చునివుండగా ఒక వ్యక్తి దుకాణంలోకి వచ్చి ఎయిర్ కూలర్లు మరమ్మతు చేస్తారా అంటూ ప్రశ్నించాడు.
చేయమని దుకాణం యజమాని చెబుతుండగా, మరో ముగ్గురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడి షట్టర్‌ను మూసివేసి, దుకాణం యజమాని భాస్కర్‌ను బెదిరించి ఒక పక్కన కూర్చోబెట్టారు. తమతో తెచ్చుకున్న బ్యాగ్‌లో నుంచి కత్తులు బయటకు తీసి న్యాయవాది రాయలును విచక్షణా రహితంగా నరికేశారు. ఆ తరువాత రాయలు జీవించివున్నాడేమోనన్న అనుమానంతో వారు రాడ్డుతో ఆయన తలపై కొట్టి పరారయ్యారు. పాత కక్షల కారణంగానే ఈ ఘటన జరిగి వుం టుందని పోలీసులు భావిస్తున్నారు. రాయలుకు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.