ఆంధ్రప్రదేశ్‌

దీక్ష విరమించిన గండికోట నిర్వాసితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 31: పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో కడప జిల్లా గండికోట నిర్వాసితులు శనివారం దీక్ష విరమించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గండికోట రిజర్వాయర్ పునరావాసులకు పరిహారంగా రూ. రూ.479 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. విషయం తెలియగానే కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం నిర్వాసితులు దీక్ష చేస్తున్న ప్రాంతానికి వెళ్లి వారికి సమాచారం చేరవేశారు. బాధితులందరికీ పరిహారం అందుతుందని హామీ ఇవ్వడంతో వారు దీక్ష విరమించారు. దండ్లూరు, చౌటపల్లి, బొమ్మెపల్లె ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి పునరావాస ప్రాంతాలకు వెళ్తామని చెప్పారు. ఆదివారం జనాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాలు సమకూర్చనున్నారు.