ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై దుష్ప్రచారం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 8: పోలవరం ప్రాజెక్టును సాకారం చేసే తరుణంలో కాంగ్రెస్, వైసిపి దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని తెలుగుదేశం నేత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు విమర్శించారు. వైకాపా నేత కెవిపి రామచంద్రరావుకు ఆయన ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఆరు నెలల్లో 104 స్ట్రక్చర్లు నిర్మించి, పట్టసీమ ప్రాజెక్టు ద్వారా పంటలను కాపాడామని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే కాంక్రీటు పనులు ప్రారంభించడంతో ఆ రెండు పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు.
రాక్‌ఫిల్ డ్యాం, భూసేకరణ, పునరావాసం, టన్నళ్ల నిర్మాణం వంటివి కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురి కాలేదా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలో 7 ముంపు గ్రామాలను ఎపిలో కలిపేందుకు ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేదన్నారు. తెలుగుజాతిలో త్యాగధనులు లేనట్లుగా ఇందిరా, రాజీవ్‌ల పేర్లు పెట్టారని విమర్శించారు. పివి నర్సింహారావు పార్థివదేహాన్ని ఢిల్లీలో అవమాన పరుస్తుంటే పౌరుషం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.