ఆంధ్రప్రదేశ్‌

ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జనవరి 16: సెల్ఫీ సరదా ఒక విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. పర్యాటక ప్రాంతమైన అరకులోయకు విశాఖపట్నం నుంచి వచ్చిన బి.టెక్ విద్యార్థి బృందంలోని ఒక విద్యార్థి సెల్ఫీ దిగుతూ ప్రమాదానికి గురై మృత్యువుతో పోరాడుతున్నాడు. స్థానిక యండపల్లివలస రైల్వే స్టేషన్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని గీతంలో బి.టెక్ చదువుతున్న నలుగురు విద్యార్థులు సోమవారం అరకులోయ వచ్చారు. పర్యాటక ప్రాంతాలను తిలకించిన వీరు యండపల్లివలస రైల్వే స్టేషన్‌లో ఫొటోలు తీసుకునేందుకు వచ్చారు. వీరిలో హెన్రీజాన్ (22) అనే విద్యార్థి రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. రైలు ఎక్కిన ఈ విద్యార్థి చేతికి రైల్వే లైన్‌లోని విద్యుత్ తీగ తగలడంతో కింద పడిపోయాడు. ఈ ఘటనలో విద్యార్థి దాదాపు 70 శాతం వరకు కాలిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన విద్యార్థిని స్నేహితులు స్థానికుల సహకారంతో ఇక్కడి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి అనంతరం విశాఖపట్నం కెజిహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ విద్యార్థి మృత్యువుతో పోరాడుతున్నాడని చెప్పారు.

చిత్రం..సంఘటన స్థలంలో తీవ్రగాయాలతో విద్యార్థి హెన్రీజాన్