ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ షాక్‌తో వాచ్‌మెన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జనవరి 26: 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైద్యశాల ఎదుట జెండాను ఏర్పాటు చేయబోయి ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ గురై ఓ కాంట్రాక్టు ఉద్యోగి మృతి చెందిన సంఘటన గురువారం పట్టణంలో జరిగింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం జవహర్‌నగర్ కాలనీలో గల ముఖ్యమంత్రి వైద్యశాల (అర్బన్ హెల్త్ సెంటర్) ఎదుట గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వనె్నల జెండాను ఏర్పాటు చేసేందుకు అక్కడ కాంట్రాక్టు కార్మికునిగా పని చేస్తున్న వాచ్‌మెన్ ఆకుమళ్ళ వెంకటేశ్వర్లు (55) పైపును పైకి ఎత్తగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుత్‌షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈప్రమాదంలో మరో ఇరువురు త్రుటిలో తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సంఘటన స్థలానికి వెళ్ళి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.