ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 26: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు బహిరంగంగా చెప్పేవన్నీ పచ్చి అబద్దాలేనని, 15 ఏళ్లు ప్రత్యేక హోదాకావాలని మొదట డిమాండ్ చేసింది చంద్రబాబే అని శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య అన్నారు. ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్యాకేజీ కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. ప్యాకేజి వస్తే నాయకులకు కోటా వస్తుందన్న ఆశతో హోదాను గాలికి వదిసేశారని విమర్శించారు. జల్లికట్టు ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటంటున్న చంద్రబాబు ఏనాడూ వాస్తవాలు చెప్పలేదన్నారు. జల్లికట్టుకోసం తమిళులంతా ఒక్కటై సాధించుకోలేనిది మనమంతా కలిసి ప్రత్యేకహోదా సాధించుకోలేమా అని అన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని రాబట్టుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా వస్తే ఉద్యోగావకాశాలతో పాటు ఎన్నో ప్రాజెక్టులు, మరెన్నో కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పిసిసి ప్రతినిధి నీలి శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు బండి జక్కరయ్య, సేవాదళ్ చైర్మన్ చార్లెస్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.