ఆంధ్రప్రదేశ్‌

తిరగబడ్డ జాతీయ జెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, జనవరి 26: నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో గణతంత్ర వేడుకల్లో అధికారుల నిర్లక్ష్యం బైటపడింది. అతి పవిత్రంగా జరుపుకునే గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాకు ఆర్డీవో శీనానాయక్ సాక్షిగా అవమానం జరిగింది. ఆర్డీవో కార్యాలయంలో త్రివర్ణ పతాకం జెండా వందన కార్యక్రమానికి ఉదయం 8 గంటల సమయంలో మండల పరిధిలోని రెవెన్యూ అధికారులు హాజరైనారు. పద్దతి ప్రకారం ఆర్డీవో శీనానాయక్, తహశీల్దార్ ఉమాదేవి, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు వరుస క్రమంలో నిలుచుని జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం జెండాకు వందనం చేసే క్రమంలో అందరు తలపైకెత్తి చూడటంతో విషయం తెలియ వచ్చింది. జాతీయ జెండా తలకిందులుగా ఎగరడంతో అధికారులు నాలుక కరుచుకొన్నారు. వెంటనే తప్పు తెలుసుకొని జెండాను కిందకు దించి తప్పును సరి చేసుకొని తిరిగి జెండాను ఎగుర వేశారు. ఆర్డీవో స్థాయి అదికారులే పవిత్రమైన జెండా వందనాన్ని అవమాన పరచడంపై పలువురు విమర్శించారు.

చిత్రం..తిరగబడి ఎగిరిన జాతీయ జెండా