ఆంధ్రప్రదేశ్
హోదా సాధించే వరకూ పోరు ఆగదు : రఘువీరా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 January 2017
విజయవాడ, జనవరి 26: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, టిడిపి ఇంకా ప్రజల్ని వంచిస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక తరగతి హోదా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిర్వహిస్తున్న వౌనదీక్షకు పోలీసులు అడుగడుగునా ఆటంకం కల్పించారని, బిజెపి, టిడిపినే ప్రజల ముందు దోషులుగా నిలిచాయని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అమలు చేయాలని ఏపిసిసి ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన వౌనదీక్షకు సహకరించిన యువతకు రఘువీరారెడ్డి అభినందనలు తెలిపారు.
చిత్రం..అనంతపురంలో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి వౌన దీక్ష