ఆంధ్రప్రదేశ్‌

‘పందుల’ వ్యాఖ్యలపై సుజనాచౌదరి క్షమాపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: జల్లికట్టు స్ఫూర్తి అయితే అదే ఆట ఆడుకోవాలి, లేకపోతే పందుల, కోళ్ల పందేలు ఆడుకోవచ్చని తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుజనా చౌదరి క్షమాపణలు చెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను ఉద్దేశించి పందుల పందేలు అంటూ తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలయినా దెబ్బతిని వుంటే క్షమించాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో సుజనా చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా పేరుతో రాజకీయ పార్టీలు ప్రజలను, యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో ప్రణాళికా సంఘం ప్రస్తుతం లేకపోవడమే ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం అన్నారు. ప్రత్యేకహోదా కంటే ప్యాకేజి వల్ల రాష్ట్రానికి ఎక్కవ ప్రయోజనాలు వస్తాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని వెల్లడించారు.