ఆంధ్రప్రదేశ్‌

ఏపి సన్ రైజ్ కాదు.. బాబు సన్ రైజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సన్’ రైజ్ అవుతున్నారని వైకాపా ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. పెట్టుబడులపై చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ లెక్కలేనని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. రెండేళ్ళలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న చంద్రబాబు అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐఐ జాయింట్ సమ్మిట్ పేరిట చంద్రబాబు అంకెల గారడీలు చేస్తున్నారని, గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రికార్డును ఆయన బ్రేక్ చేశారని అన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో ఒక్క రోజులోనే 6.50 లక్షల కోట్ల ఎంఒయులు చేస్తే, చంద్రబాబు 10.50 లక్షల ఎంఒయులు చేసుకున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబుకు ఇది మామూలు సంతోషం కాదని ‘సన్ రైజ్’ సంతోషమని బుగ్గన చమత్కారంగా అన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సమ్మిట్‌కు ముందు బాబు ఇచ్చిన లెక్కలు పరిశీలిస్తే ఇవన్నీ బయటపడతాయని అన్నారు.