ఆంధ్రప్రదేశ్
ఆ మంత్రులను బర్తరఫ్ చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 1 February 2017
హైదరాబాద్, జనవరి 31: విశాఖపట్నంలో భూ ఆక్రమణలకు పాల్పడని మంత్రులు గంటా శ్రీనివాస రావు, నారాయణను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు జి. అమర్నాథ్ డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల్లో ఉన్న పేదలను బెదిరించి భూములు లాక్కుంటున్నారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పార్టనర్షిప్ సమ్మిట్లు జరుపుకుంటున్నారని, వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే భూదందాలపై విచారణ జరిపించి, వాటిని స్వాధీనం చేసుకుని అర్హులైన వారికి అప్పగిస్తామని ఆయన తెలిపారు.