ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక ప్యాకేజీపై గట్టి నమ్మకం వుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: బడ్జెట్‌లో అమరావతి రైతులకు శుభవార్త ఉంటుందని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసిన రైతులకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సుజనా చౌదరి మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ రైల్వే మంత్రిగారే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందునా ఏపీకి తప్పకుండా ఈ బడ్జెట్‌లో న్యాయం జరుగుతుందని వ్యాఖ్యనించారు. అలాగే రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు వేరు, ఏపీకి రైల్వేజోన్ అంశం వేరు అని రైల్వేజోన్ కోసం తాము వేరే రకంగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తారని గట్టి నమ్మకం ఉందని సుజనా చౌదరి పేర్కొన్నారు.