ఆంధ్రప్రదేశ్‌

మాట మార్చడంలో ఘనులు చంద్రబాబు, వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 2: ప్రజల్ని మోసగించడంలో, రోజుకో మాట మార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు మించినవారు దేశంలో మరెవ్వరూ లేరని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. స్థానిక దాసరి భవన్‌లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, పెద్దనోట్ల రద్దుపై చంద్రబాబు, వెంకయ్య రోజుకో రకంగా మాట మార్చారని, పైగా దొంగే దొంగ అన్నట్లుగా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో వున్న తమకు కావాల్సిన డిమాండ్లపై స్పష్టతతో వుండాలన్నారు. వాటికోసం పోరాడాలని, చేతగాకుంటే ఇంట్లో కూర్చోవాలన్నారు. చంద్రబాబు ఈ రెండు పనులూ చేయకుండా కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారని నారాయణ ఎద్దేవా చేశారు.