ఆంధ్రప్రదేశ్‌

ఏపికి హోదా ఇవ్వాల్సిందే: కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. విజయవాడలో మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు విచ్చేసిన కవిత తొలుత కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనన్నారు. తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని.. అలాగే ఉందామని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీలన్నీ అక్షరాలా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటానికి తమ పార్టీ కూడా మద్దతు ఇవ్వగలదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చిత్రం..మహిళా పార్లమెంట్ సదస్సులో ప్రసంగిస్తున్న ఎంపి కవిత