ఆంధ్రప్రదేశ్‌

ఆహ్వానించి అవమానించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి అవమానించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదివారం ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. ఇది మహిళా పార్లమెంటు సదస్సును అపహాస్యం చేయడమేనని అన్నారు. మహిళా ఎమ్మెల్యే పట్ల ఎపి పోలీసులు దారుణంగా వ్యవహరించారని తప్పుపట్టారు. ఒక ఎమ్మెల్యే పట్లనే ప్రభుత్వం ఇలా వ్యవహిస్తే ఇక సామాన్య మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేకు జరిగిన అన్యాయంపై పోరాడుతామని, ఈ అంశంపై అన్ని వేదికల నుంచి లేవనెత్తుతామని జగన్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ఆహ్వానం మేరకు సదస్సుకు వెళుతున్న ఎమ్మెల్యేను అడ్డుకుని అన్యాయంగా తిరిగి హైదరాబాద్ పంపించారని ఆరోపించారు.