ఆంధ్రప్రదేశ్‌

16న జగన్ యువభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 13: రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన విషయంలో తమతో కలసొచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాడేందుకు వెనుకాడబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈనెల 16న గుంటూరులో పార్టీ అధినేత జగన్ యువభేరి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బొత్స మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయినా, మరే ఇతర రాజకీయ పార్టీలయినా హోదా విషయంలో కలసి పనిచేస్తామని చెప్పారు. ఢిల్లీలో ధర్నా నిర్వహించినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో జగన్ ప్రత్యేక హోదా అంశంలో రాజీలేని పోరాటం చేస్తున్నారని తెలిపారు. హోదా సాధించాలంటే ప్రతి విద్యార్థి, యువజనులు తలచుకుంటేనే సాధ్యపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న గుంటూరు నల్లపాడులో యువభేరి సదస్సుకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను నిర్బంధించడంపై బొత్స స్పందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం మహిళలను ఏరకంగా వేధింపులకు గురిచేస్తుందీ ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. మహిళా పార్లమెంటేరియన్‌ను పేరుతో ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల అవమానకరంగా ప్రవర్తించటం, వేధింపులకు గురిచేయటం అటు పోలీసులు, ఇటు ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళా పార్లమెంట్‌ను తమ జేబులో డబ్బుతో నిర్వహించారనే ఫీలింగ్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఇది అక్షరాల ప్రజల సొత్తన్నారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ ముస్త్ఫా, కోన రఘుపతి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లాపార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.