ఆంధ్రప్రదేశ్‌

బోగస్ ఓటర్ల తొలగింపులో జాప్యమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రానున్న కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాల మండలి ఎన్నికల్లో ఓటర్ల జాబితా నుంచి బోగస్ ఓట్ల తొలగింపులో నిబంధనలు ఎందుకు పాటించడం లేద ని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని అడిగింది. రాయలసీమ అభివృద్ధి కమిటీకి చెందిన జి.ఓబులు ఓట ర్ల జాబితా నుంచి బోగస్ ఓటర్లను తొలగించడం లో ఎన్నికల సంఘం స్తబ్దతగా వ్యవహరిస్తోందని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై బుధవా రం విచారణ చేపట్టిన కోర్టు ఎన్నికల సంఘం తరఫున న్యాయవాదిని వివరణ కోరింది. ఓటర్ల జాబితాలో చాలా లోపాలు ఉన్నందున ఎన్నికల ప్రధానాధికారి కోర్టుకు వచ్చి కోర్టుకు సహకరించే విధం గా చూడాలని న్యాయవాదికి బెంచ్ స్పష్టం చేసింది.