ఆంధ్రప్రదేశ్‌

వైకాపా గూటికి గంగుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకుడు గంగుల ప్రభాకర్ రెడ్డి బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గంగుల చేరికతో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారుతుందని విశే్లషకులు భావిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ గంగులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని, ఒకరికొకరు తోడుగా ఉందామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రలోభ పెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని విమర్శించారు.
ఈ అన్యాయం ఎంతో కాలం ఉండదని, అధర్మం గెలిచినట్లు కనిపించినా చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుందని అన్నారు. అధికారంలో ఉన్న వారు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ళు గడిచిందని, మరో ఏడాది గడిస్తే ఎన్నికల సంవత్సరమే వచ్చేస్తుందని, ఆ తర్వాత మనందరి ప్రభుత్వమే వస్తుందని ఆయన చెప్పారు. గంగుల వెంట టిడిపి స్థానిక ప్రజాప్రతినిధులు, అనుచరులు పెద్దఎత్తున పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిరావడంతో పార్టీ కార్యాలయం సందడిగా మారింది.

చిత్రం..గంగుల ప్రభాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్న వైఎస్ జగన్