ఆంధ్రప్రదేశ్‌

20న కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 17: ప్రత్యేక హఓదాతోనే రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి సాధ్యమన్న విషయాన్ని పక్కదారి పట్టించి లేని ప్యాకేజీపై ప్రచారం చేస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు ప్యాకేజీతో ఎవరికి మేలు కలుగుతుందో ప్రజలకు తగు సమాధానం చెప్పాలని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఇదే విషయమై ఈనెల 20వ తేదీన ఎపిసిసి కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రత్యేక హోదా, టిడిపి, బిజెపి ల ఎన్నికల హామీ అమలుపై ప్రజాబ్యాలెట్, ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాల కమిటీ కార్యాచరణ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కార్యాచరణ తదితర అంశాలపై విస్తృత చర్చ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన డిసిసి, నగర పార్టీ అధ్యక్షులు, పెద్ద నోట్ల రద్దు వ్యతిరేక కమిటీ జిల్లా చైర్మన్లు, రాష్ట్ర చైర్మన్, శాసన మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య తోపాటు ఎపిసిసి ముఖ్య నేతలు పాల్గొంటారని రఘువీరారెడ్డి తెలిపారు.