ఆంధ్రప్రదేశ్‌

39 గృహాలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, ఫిబ్రవరి 20: పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కటుకూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 39 గృహాలు దగ్ధమయ్యాయి. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఆదివారం అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో పెరుమళ్ల శ్రీను అనే వ్యక్తి ఇంట్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ ఇంట్లో గ్యాస్ సిలెండరు పేలి, చుట్టుపక్కల గృహాలకు మంటలు వ్యాపించాయి. అన్ని ఇళ్లల్లో గ్యాస్ సిలెండర్లు పేలుతుండడంతో ఎవరూ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేయలేదు. సుమారు గంటన్నర వ్యవధిలో 39 గృహాలు కాలి బూడిదయ్యాయి. కాగా అగ్నిప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వేలేరుపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం సోమవారం జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆసుపత్రులకు తరలించారు.