ఆంధ్రప్రదేశ్‌

ఇక మిమ్మల్ని భరించలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: విశాఖ జిల్లాలోని వర్గ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేధాలపై ‘మిమ్మల్ని భరించలేను.. ఇకనైనా మారండి’ అంటూ స్పష్టం చేసినట్లు తెలిసింది. మంత్రి గంటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విజయవాడ ఉండవల్లిలో తన నివాసంలో పార్టీ విశాఖ జిల్లా నేతలతో ఆయన సోమవారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. విభేదాల వల్ల పార్టీకి జిల్లాలో నష్టం కలుగుతోందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే చాలా సార్లు అన్ని రకాలు నచ్చచెప్పినా పరిస్థితిలో మార్పులేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన నేతలే ఇలా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కల్గించే రీతిలో వ్యవహరించే వారిని భరించడం ఇక సాధ్యం కాదని తేల్చిచెప్పినట్లు సమాచారం. తనకు పార్టీ చాలా ముఖ్యమని, పార్టీకి ఇబ్బంది కల్గించేవారిపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోనని సుతిమెత్తంగా హెచ్చరించారు.