ఆంధ్రప్రదేశ్‌

మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: ఎండలు పెరుగుతున్నాయి.. మంచినీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి.. మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చెరువులు నింపుకునేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పని ప్రదేశాల వద్ద మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా, అవసరాన్ని బట్టి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. ఉపాధిహామీ పనుల్లో గుంటూరు జిల్లా వెనుకబడి ఉండటం సరికాదన్నారు. మాచర్ల, వినుకొండ, గురజాల నియోజకవర్గాల్లో ఉపాధి పనులు ముమ్మరం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నీటి భద్రత బాధ్యత జలవనరుల శాఖదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వివిధ పనులకు సంబంధించి జలవనరులశాఖకు చెల్లించాల్సి వున్న రూ.300 కోట్ల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో జిల్లాలో మంచినీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. 2018కల్లా వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఇప్పటివరకు 2,50,929 పంట కుంటలు తవ్వారని, మిగిలిన లక్షా 50వేలు నెల రోజుల్లో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సిమెంటు రోడ్ల నిర్మాణం 4,306 కిమీ పూర్తిచేశారని, టార్గెట్‌లో మిగిలిన 700 కిమీ నిర్మాణం వెంటనే పూర్తిచేయాలన్నారు. 2లక్షల వర్మికంపోస్టు పిట్లు లక్ష్యం కాగా, ఈ వారంలో 6వేలు పూర్తిచేశారని, ఇప్పటివరకు 92,590 పూర్తయ్యాయని, పనులు ప్రారంభించిన మిగిలిన 53వేలు తక్షణమే పూర్తిచేసేలా శ్రద్ధ చూపాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం 5 లక్షలు కాగా 3 లక్షల మరుగుదొడ్ల పనులు ప్రారంభించారని, 1,65,623 పూర్తయ్యాయని అధికారులు వివరించగా, గ్రౌండ్ అయిన వాటిలో మిగిలిన లక్షా 40వేలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతల తవ్వకం తాలూకు నిధులు పెండింగ్ ఉన్న విషయం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, రవికుమార్, వర్మ, బోడె ప్రసాద్ ప్రస్తావించగా వెంటనే బకాయి నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.