ఆంధ్రప్రదేశ్‌

ఎయిమ్స్ నిర్మాణంలో ఏమిటీ జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 28: రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఎయిమ్స్‌కు అవసరమైన అనుమతుల మంజూరులో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిమ్స్ నిర్మాణ పురోగతిపై వెలగపూడి సచివాలయంలో సిఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఎయిమ్స్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి అందించినా, నిర్మాణంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. త్వరితగతిన ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన 1.93 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. ఎయిమ్స్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన అన్ని అనుమతులు 10 రోజుల్లో వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్, పాల్గొన్నారు.