ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ శవం లాంటిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మార్చి 3: కాంగ్రెస్ పార్టీ శవం లాంటిది....దానికి కాటికాపరిగా పిసిసి అధ్యక్షుడు రఘువీరా ఉన్నాడు...త్వరలో ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు... ఇక మీరెందుకు ఆ పార్టీలో ఉంటారంటూ అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి తనను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో వ్యాఖ్యానించారు. మండలి ఎన్నికల ప్రచారంలో భాగం గా అనంతపురం జిల్లా హిందూపురంలో శుక్రవారం సాయం త్రం జెసి దివాకర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, పిసిసి ఉపాధ్యక్షులు ఆదిమూర్తి తదితరులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జెసి స్పందిస్తూ రఘువీరాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, రఘువీరా త్వరలో వైకాపాలో చేరతారు. మీరు ఆ పార్టీలో ఉండి ఏం సాధిస్తారు, టిడిపిలోకి చేరడంటూ పరోక్షంగా సూచించారు. మీరు ఏ పార్టీలో ఉన్నా మా నాయకుడే అంటూ బాలాజీమనోహర్ పేర్కొనడం గమనార్హం. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై స్పందిస్తూ తమ తప్పిదం ఉంటే చట్టపరంగా ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని ఎంపి అన్నారు. జగన్మోహన్‌రెడ్డి కక్షగట్టుకుని తమను ఉద్దేశించి ఆరోపణలు చేయడం దిగజారుడుతనమన్నారు. మీ నాన్న వైఎస్‌ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. మృతదేహం ముక్కలు ముక్కలైంది. ..శరీర భాగాలు ఎవరివో తెలియవు...ఆ సమయంలో కూడా సంతకాలు తీసుకొని సిఎం కావాలనుకున్నావు....ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు...అనవసరంగా బస్సు ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని విచక్షణారహితంగా ఆరోపణలు చేస్తావా అంటూ దుయ్యబట్టారు.