ఆంధ్రప్రదేశ్‌

విమర్శించే ముందు వెనక్కితిరిగి చూసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 10: నిత్యం కోర్టుల చుట్టూ తిరిగే వైకాపా నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విమర్శించే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ ఎంత ఘనుడో వోక్స్‌వాగన్ కంపెనీ స్విట్జర్, అలెక్‌రాజాని అడిగితే చెబుతారన్నారు. లిక్కర్ కేసులో ఐదు జిల్లాల్లో తమ కుటుంబానికి లిక్కర్ సిండికేట్లతో సంబంధాలున్నాయి అని చెప్పిన బొత్స గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు. ఈ రోజుకీ మీ పార్టీ అధ్యక్షుడు, ఇతర నేతలు, మీకు సాయపడిన అధికారులు, పారిశ్రామికవేత్తలు మొత్తం కోర్టుల చుట్టూ తిరుగుతునే ఉన్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. మీ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రతి శుక్రవారం పోవాలి, మీ పార్టీ అధ్యక్షుడికి కుడిభుజం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోర్టులో ముద్దాయిగా నిలబడాలి.. ఇలాంటి మీరు చంద్రబాబునాయుడి గురించి మాట్లాడతారా అని సోమిరెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించినందున చంద్రబాబునాయుడు రాజీనామా చేయాలంటున్న బొత్స ఆ కేసును హైకోర్టు చాలా స్పష్టంగా కొట్టివేసిన విషయాన్ని మర్చిపోయారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ కేసును వేశారనే విషయాన్ని కాదనలేమని కూడా హైకోర్టు వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. అదే విధంగా ఎకౌంటింగ్ సిస్టమ్స్ ప్రకారం బుక్ విలువ, మార్కెట్ విలువ అని రెండు ఉంటాయి.. రెండింటి మధ్య వ్యత్యాసం ఉండటం సర్వసాధారణం.. మీ ఆడిటర్ విజయసాయిరెడ్డిని అడిగి ఒకసారి రూల్స్ తెలుసుకోండని హితవు పలికారు. లోకేష్ గత అక్టోబర్‌లో చెప్పిన ఆస్తుల వివరాలు, ఈ రోజు అఫిడవిట్‌లో ఇచ్చిన ఆస్తుల వివరాలపై విజయసాయిరెడ్డికి, జగన్మోహనరెడ్డికి అవగాహన ఉందనే తాను భావిస్తున్నానన్నారు.