ఆంధ్రప్రదేశ్‌

తగ్గని ఎండ తీవ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/కర్నూలు/అనంతపురం, ఏప్రిల్ 18: రాయలసీమలో భానుడి భగభగలు తగ్గటం లేదు. కడప నగరంలో 44.02 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అనంతపురంలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కర్నూలు నగరంలో 43 డిగ్రీలుగా నమోదయింది. కడప, అనంతపురం జిల్లాల్లో సోమవారం వడదెబ్బకు ఆరుగురు మృతిచెందారు. కడప జిల్లా మండల కేంద్రమైన చెన్నూరులో గుర్తు తెలియని బట్టల వ్యాపారి, చెన్నూరులోని రెడ్డివారివీధికి చెందిన బరయ్యగారి రాజారెడ్డి (57), గంగవరం దళితవాడకు చెందిన పెద్ద లక్ష్మమ్మ (60), ముద్దనూరు మండలం కొత్తకొట్టాల గ్రామానికి చెందిన సి వెంకటమ్మ (60), అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి గ్రామానికి చెందిన మంగల చిన్నఓబిలేశు (72), బాలంపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి (30) మృతి చెందారు.