ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఆదివారం నాటితో ప్రశాంతంగా ముగిశాయి. శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఈ నెల 9న జరగాల్సిన మేథమెటిక్స్ పరీక్ష ఆదివారం జరిగింది. 3లక్షల 90వేల 679 మంది అభ్యర్థులకు గాను 10వేల 869 మంది గైర్హాజరయ్యారు. కీలకమైన ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగియటంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ బి ఉదయలక్ష్మి పరీక్షలకు నెలరోజుల ముందు నుంచే పరీక్ష కేంద్రాల ఏర్పాటు నుంచి ఇతరత్రా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలావుండగా ప్రథమ సంవత్సర పరీక్షలకు 11వేల 732 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 16వేల 424 మంది అభ్యర్థులు గైర్హాజయ్యారు. మాల్‌ప్రాక్టీస్ కింద ప్రథమ సంవత్సర పరీక్షల్లో 66, ద్వితీయ సంవత్సర పరీక్షల్లో 33 మొత్తం 99 కేసులు నమోదయ్యాయి.