ఆంధ్రప్రదేశ్‌

సాగునీరందిస్తే మళ్లీ టిడిపిదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 19 : రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పొగరుబోతు నేత అని అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపి జెసి ఆదివారం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఎంపి జెసి విలేఖరులతో మాట్లాడుతూ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ పొగరుబోతు తనం వల్లే రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రైతులకు సాగునీరు అందిస్తే 2019 ఎన్నికల్లో కూడా టిడిపినే గెలిచి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అలాగే 2018-19 ఏడాదికి జిల్లాలోని అన్ని గ్రామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు రెట్టింపు పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎంపి నిధులు రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భూమిపూజ కార్యక్రమానికి స్థానిక శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల గైర్హాజరు కావడం గమనార్హం. సరైన సమాచారం ఇవ్వనందుకే ఆమె హాజరు కాలేదని ఎమ్మెల్యే వర్గీయులు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఎంపి జెసితో సఖ్యత కొరవడినందుకే ఎమ్మెల్యే రాలేదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగింది.