ఆంధ్రప్రదేశ్
ఒక్క ఇటుకైనా పెట్టారా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 26 March 2017
విజయవాడ, మార్చి 25: అమరావతి నగరాన్ని ప్రపంచ శ్రేణి రాజధానిగా నిర్మిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వం మూడేళ్ళవుతున్నా, ఒక్క ఇటుకనైనా పెట్టలేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో బ్రేక్ ఇచ్చి అమరావతి నిర్మాణ డిజైన్లపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వ తీరుపై ఆయన స్పందిస్తూ ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రజెంటేషన్ అంటూ ధ్వజమెత్తారు. మరోగంట సమయం వృథా తప్ప ఒరిగేది ఏమీలేదన్నారు. ఈ కారణంతోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు హాజరు కాలేదన్నారు. అనంతరం లాబీల్లో కొద్దిసేపు విలేఖర్లతో మాట్లాడారు.