ఆంధ్రప్రదేశ్‌

మంత్రాలయంలో ముగ్గురి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, మార్చి 26 : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ముగ్గురు పాండిచ్చేరి వాసులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. మంత్రాలయం సిఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాలు.. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన శరవణన్(42), ఆయన సోదరి శాంతి(38), ఆమె కుమార్తె పవిత్ర(12) రెండు రోజుల క్రితం మంత్రాలయంలో ఓ వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. తమకు ఎవరూ లేరని, దీంతో మనస్థాసానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నామని, తమ మృతదేహాలకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని వారి వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో రాసి ఉందని సిఐ తెలిపారు. దీంతో వారి మృతదేహాలకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

చిత్రం.. మంత్రాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన పాండిచ్చేరి వాసులు