ఆంధ్రప్రదేశ్‌

‘సత్యంబాబు కుటుంబాన్ని ఆదుకుంటాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 4: ఒక దళితుడిని, అమాయకుడిని అన్యాయంగా కేసులో ఇరికించి శిక్షకు గురిచేశారని, ఆ కుటుంబాన్ని ఆదుకోడానికి ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన పిడతల సత్యంబాబు మంగళవారం రాష్ట్ర అతిధి గృహంలో కారెం శివాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తొలి నుండి సత్యంబాబు కేసు విషయంలో తాను పోరాడుతున్నానన్నారు. ఆర్థికంగా సత్యంబాబు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కమిషన్ కృషి చేస్తుందన్నారు. సత్యంబాబు విషయంలో న్యాయపరంగా కమిషన్ అండగా ఉంటుందని కారెం శివాజీ పేర్కొన్నారు.