ఆంధ్రప్రదేశ్‌

రైతులను మోసం చేసిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొండూరు, ఏప్రిల్ 14: రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. పులివెందులకు నీళ్లు ఇచ్చిఉంటే చెట్లు ఎలా ఎండిపోతాయో చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. కడప జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో ఎండిపోయిన చీనీ తోటలను జగన్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ నాయకులు పులివెందులకు నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే నీళ్లు ఇచ్చిఉంటే చెట్లు ఎలా ఎండిపోతాయో వారే చెప్పాలన్నారు. పైడిపాళెంకు 6 టిఎంసిల నీరు ఇవ్వాల్సి ఉండగా 0.3 టిఎంసిల నీరు మా త్రమే ఇచ్చారన్నారు. అలాగే చిత్రావతికి 10 టిఎంసిల నీరు రావాల్సి ఉండగా సాగునీటి కోసం 0.23 టిఎంసిలు మాత్రమే ఇచ్చారన్నారు. లింగాల, సింహాద్రిపురం, తొండూరు మండలాలకు నీరు ఇచ్చామని చెబుతున్నారని, అయితే ఇక్కడ మాత్రం పండ్లతోటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయన్నారు. రైతులకు బాబు ఇచ్చిన రుణమాఫీ నిమిత్ర మాత్రమేనన్నారు. రుణమాఫీ వస్తున్నదని వడ్డీ కట్టకుండా ఉండిపోవడంతో ప్రస్తుతం వడ్డీ మరింత పెరిగి కట్టలేక రైతు నడ్డి విరుగుతోందన్నారు. రూ.82 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి వుండగా రూ.48 వేలకోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు.

చిత్రం..కడప జిల్లా తుమ్మలపల్లెలో చీనీ చెట్లను పరిశీలిస్తున్న జగన్మోహన్‌రెడ్డి