ఆంధ్రప్రదేశ్‌

మోదీ వద్ద జగన్ ఆటలు సాగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: ప్రధాని నరేంద్ర మోదీ వద్ద వైకాపా అధినేత జగన్ ఆటలు సాగవని తమకూ తెలుసునని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ అవినీతిపరుల విషయంలో ప్రధాని చండశాసనుడని, కాళ్లకు మొక్కితే కనికరం లభించదని ఎద్దేవా చేశారు. కాపురం చేయలేం కానీ శోభనానికి ఓకే అన్నట్లుగా వైసిపి తీరు ఉందని ఆరోపించారు. సిబిఐ, ఇడి దెబ్బతో ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో కాపురం చేయాలో తెలియని అయోమయంలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రధానితో జగన్ భేటీపై తమకేమీ అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్టప్రతినే కలిసిన జగన్, ప్రధానితో భేటీ అయితే తాము ఎందుకు ఇబ్బంది పడతామని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రధానిని కలిశామని చెప్పి రాజకీయాలు మాట్లాడారని విమర్శించారు. ఎన్‌డిఏ విషయంలో వైకాపా విధానమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.