ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ది పిలవని పేరంటం: సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: ‘పిలవని పేరంటానికి వెళ్లి ఎన్డీఏకి మద్దతు ప్రకటించి వచ్చి ఇక్కడ రాద్ధాంతం ఎందుకు.. ఇవాళ రైతు సమస్యలపై అసలు వైసిపికి చిత్తశుద్ధే లేదు.. జీఎస్టీ బిల్లు కోసం అంతా ఎదురు చూస్తుంటే, అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా సభను అడ్డుకుంటున్నారు.. రాష్టప్రతి అభ్యర్థికి బేషరతు మద్దతు ప్రకటిస్తారు.. అదే ఎన్డీఏ ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుకు అడ్డంకులు కల్పిస్తారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంగళవారం సోమిరెడ్డి మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్‌కు రాజకీయ స్థిమితం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఢిల్లీలో ఒక రకంగా, అమరావతిలో మరో రకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. మిర్చి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసిపికి ఉందా అని ప్రశ్నించారు.