ఆంధ్రప్రదేశ్‌

విస్తరించనున్న నైరుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించనున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నర్సాపూర్, తెలంగాణలో ఆదిలాబాద్ ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్న రుతుపవనాలు, మెల్లమెల్లగా ఉత్తర కోస్తాకు విస్తరించే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. రుతుపవనాలు విస్తరించే క్రమంలో బుధవారం నుంచి క్రమంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చెదురు,మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గడ్ నుంచి కోస్తా మీదుగా తమిళనాడుకు అల్పపీడనం ఏర్పడిందని, దీనికి తోడు ఛత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాలను ఆనుకుని బంగాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని తెలిపారు. ఈ రెండింటి ప్రభావంతో రుతుపవనాలు క్రమంగా బలపుతున్నాయని పేర్కొన్నారు.