ఆంధ్రప్రదేశ్‌

రెండ్రోజుల్లో రెవెన్యూ, పోలీస్ శాఖల్లో బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపిఎస్‌ల బదిలీలు రెండ్రోజుల్లో జరగనున్నాయి. ఉండవల్లిలో డిజిపి సాంబశివరావు, ఇంటిలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సమావేశమయ్యారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో బదిలీలను రెండ్రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఐపిఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ఐజిలు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డిఎస్పీలను ఒకేసారి బదిలీ చేయాలని నిర్ణయించారు. బదిలీల ప్రక్రియలో భాగంగా ఐపిఎస్ అధికారులతో సోమవారం సమావేశం కావాలని సూచించారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేసిన కొన్ని ఘటనల నేపథ్యంలో పోలీస్ అధికారులతో బదిలీలకు ముందుగానే మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. ఇంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్డీవోల బదిలీలు కూడా జరపాలని నిర్ణయించారు.