ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: విజయవాడ కేంద్రంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఆదివారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 25 సబ్ సెంటర్లలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 11వేల 568 మంది అభ్యర్థులకు గాను కేవలం 4వేల 311 మంది (37.27 శాతం) మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ కొద్దిమందిలో కూడా మధ్యాహ్నం జరిగిన రెండో పరీక్షకు 76 మంది డుమ్మా కొట్టారు. కఠోర దీక్షతో తగిన విధంగా శిక్షణ పొందలేక కొంతమంది పరీక్ష సమయానికి వెనుకంజ వేస్తున్నట్టు కనిపిస్తోంది. పరీక్ష కేంద్రాలను కృష్ణా జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. పరీక్ష పేపర్లు, ఓఎంఆర్ ఆన్సర్ షీట్లకు సీలువేసి స్ట్రాంగ్ రూమ్‌లకు పంపించారు.