ఆంధ్రప్రదేశ్‌

2నుంచి విజయవాడలో వేంకటేశ్వర వైభవోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 18: టిటిడి శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 9 వరకు విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలో వేంకటేశ్వర వైభవోత్సవాలు జరుగనున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇందుకోసం విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుచేసి ఉదయం 6.30 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 9 గంటలకు ఏకాంతసేవ వరకు కైంకర్యాలు నిర్వహిస్తారు. రోజువారీ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక సేవ, ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు రెండో నివేదన చేపడతారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5.45 నుంచి 6.30 గంటల వరకు సహస్ర దీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.15 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. జూలై 2, 3 తేదీల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల ధార్మికోపన్యాసాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక సేవల్లో భాగంగా జూలై 4న అష్టదళ పాదపద్మారాధన, జూలై 5న సహస్ర కలశాభిషేకం, 6న తిరుప్పావడ, 7న అభిషేకం, 8న వసంతోత్సవం, శ్రీనివాస కల్యాణం, జూలై 9న పుష్పయాగం నిర్వహిస్తారు.