ఆంధ్రప్రదేశ్‌

పూర్తిస్థాయిలో ఇ-ఫైలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: వెలగపూడి సచివాలయంలోని ఫైల్స్ అన్నీ ఇ-ఆఫీస్ పద్ధతిలో నిర్వహించాలని, పరిపాలనలో భౌతికమైన ఫైల్స్ (పేపర్ లెస్) లేకుండా సచివాలయ అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇ-ఆఫీస్ నిర్వహణ, త్వరితగతిన పైళ్ల పరిష్కారం, తదితర అంశాలపై సచివాలయ ఉన్నతాధికారులకు సిఎస్ కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇ-ఆఫీస్ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. కార్యదర్శి స్థాయి నుంచి ఏఎస్‌ఓ స్థాయి ఉద్యోగుల వరకు అందరూ ఇ-ఫైలింగ్ విధానం అనుసరించాలని పేర్కొన్నారు. ఎస్‌ఓలు, ఏఎస్‌ఓలు గరిష్ట స్థాయిలో పైళ్లను పరిష్కరించే విధంగా ఉన్నత స్థాయి కార్యదర్శులు చూడాలన్నారు. వారికి సమాన స్థాయిలో పనిని అప్పగించాలని పేర్కొన్నారు. కొంతమంది ఏఎస్‌ఓలు ఏడాది కాలంలో ఒక్క ఇ-ఫైల్ కూడా పంపలేదని తెలిపారు. పైళ్లు త్వరగా పరిష్కారమవడానికి మంత్రులు, కార్యదర్శులు సమీక్షలు నిర్వహించి, ఆయా శాఖల పనితీరు మెరుగుపరచాలని చెప్పారు. సచివాలయంలో విజిలెన్స్, భూసేకరణ, పెద్ద ఎత్తున ఉన్న ఇతర ఫైల్స్‌తో సహా పూర్తి స్థాయిలో అంతా ఇ-ఫైలింగ్ జరగాలని, అయితే ఏవైనా తప్పనిసరిగా భౌతిక రూపంలోనే పంపించవలసిన ఫైల్స్‌ను సిఎస్ అనుమతితోనే పంపాలన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది 20,163 జీఓలు విడుదల చేసిందని, అయితే వాటిలో 46 శాతం ఎస్టాబ్లిష్‌మెంట్‌కు సంబంధించినవే ఉన్నాయని, వీటిని తగ్గించి, సామాన్య ప్రజలకు ఉపయోగపడేవి, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన జీఓలు ఎక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఇ-ఫైలింగ్‌ని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసి) వారు లెక్కించి నివేదిక ఇచ్చారని, ఏడాదికి 900, రోజుకు మూడు ఫైళ్ళు పరిష్కరించిన వారిని హై వాల్యూమ్‌గా, మిగిలిన వారిని లోవాల్యూమ్‌గా గుర్తించారని తెలిపారు. ఫైల్‌ని 24 గంటల్లోగా పరిష్కరించిన వారిని హైస్పీడ్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. పది మంది కార్యదర్శులు, 49 మంది ఎఎస్‌లు, 24 మంది ఎస్‌ఓలు హైవాల్యూమ్, హైస్పీడ్ కేటగిరి 1లో ఉన్నారని, 18మంది సెక్రటరీలు, 22 మంది ఏఎస్‌లు, 210 మంది ఎస్‌ఓలు, 418 మంది లోవాల్యూమ్, లోస్పీడ్‌లో ఉన్నారని వివరించారు.